"దేశ భాషలందు తెలుగు లెస్స" - తుళువ రాజు శ్రీకృష్ణదేవరాయ
"dESa bhAshalaMdu telugu lessa" - tuLuva rAju SrI kRshNadEvarAya
Telugu is the sweetest among all languages of the Land - Great Tuluva Emperor Sri Krishnadeva Raya, 16th Century

తెలుగు మాట...తేనె ఊట
TELUGU...a language sweeter than honey

మంచిని పంచుదాము వడపోసిన తేనీటి రూపం లో
తేనెకన్న మంచిదని తెలుగును చాటుదాము వేనోల్ల
ఇదే నా ఆకాంక్ష, అందరి నుంచి కోరుకునె చిరు మాట

"TELUGU - Italian of the East" - Niccolo Da Conti, 15th Century


"సుందర తెలుంగిళ్ పాటిసైతు" - శ్రీ సుబ్రహ్మణ్య భారతి
"suMdara teluMgiL paaTisaitu" - SrI subrahmaNya bhArati
Let us sing in Sweet Telugu - Tamil poet Sri Subrahmanya Bharati, 20th Century

Wednesday, June 29, 2005

Telugu songs and more...

A website for Telugu songs, videos and more...

http://www.musicmazaa.com/telugu/


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


He left his imprint in Telugu printing


- by V.Sundaram



Printing may be a technical job these days. But in olden days, only scholars in particular subjects took up printing. Perhaps it had to do with proofing and correction work. But that was the case.

In the late 19th Century, when printing business was getting stabilised in Madras, it faced a quaint problem. Though there was a sizeable number of Telugus in Madras then, there were no Telugu printing presses.

To fill in this vacuum, arrived an enterprising scholar in Telugu and Sanskrit hailing from one of the Andhra Districts of Madras Presidency in 1863. V Ramaswamy Sastrulu was his name.

He started a publishing firm in Madras City in 1863 to publish books in Telugu and Sanskrit. Within a period of 20 years, V Ramaswamy Sastrulu & Sons became the foremost Telugu and Sanskrit printing and publishing firm in Madras Presidency. The Government of Madras also started entrusting the printing of all their orders and circulars in Telugu to his firm.

He published almost all the existing Telugu and Sanskrit works (in Telugu character), together with commentaries on numerous Telugu classics. His name became a household word in every village in the Andhra region. The masterly way in which he edited and published very many rare Telugu books, which were hitherto unknown to the world at large, made him a father figure among all classes of people in the Telugu country.

In his publishing works he received the full support and patronage of the Maharajas of Vizianagaram and Venkatagiri. His fame as a writer and publisher rests on his gigantic work of the Ramayana, with elaborate Telugu commentaries. He published this work in 15 volumes (royal octavo).

When he started his work as a Printer, there was only one body of Telugu type (fonts, in today's parlance), called 'Great Primer'. Ramaswamy Sastrulu with his acute technical acumen invented a new class of Telugu type, which went by the name of 'English Body'. This type became very famous in the world of Telugu printing and publishing. All the great Sanskrit and Telugu scholars from different parts of Madras Presidency used to go to his house for literary and intellectual discussions. His contemporaries have reported that he was a man of outstanding intellectual caliber.

But when he saw a man of outstanding intellectual ability before him, he never hesitated to go to the person and take lessons from him. With high ideals, his aims were always noble and his methods, honest and straightforward. Always helpful to those who approached him for consultations, he was stern and forthright with everybody.

Of knowledge, of the power to benefit in every way, what he had, he gave and so benefited those who went to him, as well as himself.

In his study room there was a black board on which he had inscribed the following words of Sir William Jones (1747-1794), Founder of the Asiatic Society of Bengal in Calcutta: 'The Sanskrit language, whatever be its antiquity, is of a wonderful structure; more perfect than the Greek, more copious than the Latin, and more exquisitely refined than either, yet bearing to both of them a stronger affinity, both in the roots of verbs and in the forms of grammar, than could possibly have been produced by accident; so strong indeed, that no philologer could examine them all three, without believing them to have sprung from a common source, which, perhaps, no longer exists; there is a similar reason, though not quite so forcible, for supposing that both the Gothic and the Celtic, though blended with a very different idiom, had the same origin with the Sanskrit; and the old Persian might be added to the same family.'------ Sir. William Jones (1786).

Ramaswamy Sastrulu's book department was at No.192, Esplanade Road. The Printing Press was at 69, Mallia Perumal Street, George Town. His residence was at 323, Tiruvottiyur High Road, Tondiarpet. Ramaswamy Sastrulu passed away in 1901. On his death, the business was taken over by his son V Venkateswara Sastrulu. He was also a very great Sanskrit and Telugu scholar.

Many books of Mahamahopadhyaya Vidyavachaspati S Kuppuswami Sastri (1880-1943), Principal of the Mylapore Sanskrit College (1906), Professor of Sanskrit, Presidency College, Madras (1912), Professor of Sanskrit, Annamalai University (1936) were published by Ramaswamy Sastrulu & Sons.

Quite simply, he left an imprint on the Telugu printing world.

Courtesy: News Today


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Tuesday, June 28, 2005

తెలుగు భాష అమలు జీవో ఏది?

హైదరాబాద్‌,జూన్‌28(ఆన్‌లైన్‌): ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరిగా బోధించాలన్న ప్రభుత్వ ఉత్తర్వును ఎవరూపట్టించుకోవ డం లేదని ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలల్లో తెలుగును విధిగా బోధించాలని , త్రిభాషాసూత్రాన్ని అనుసరించాలని ప్రభుత్వం 2003లో జీవో86 ఉత్తర్వును విడుదల చేసిందని ఆయన ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.కానీ ఆ ఉత్తర్వు అమలవుతుందా..?లేదా..? అని తనిఖీచేసేందుకు ప్రత్యేకంగా అధికా రులెవ్వరూ లేరని ఆయన పేర్కొన్నారు. దీంతో జీవో నామమాత్రంగా మిగిలి పోయిందని ఆయన విచారం వెలిబుచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రాథమికస్థాయిలోనే ఇంగ్లీష్‌ మాధ్యమాన్ని మొదలు పెట్టడం దురదృష్టకర మ న్నారు. 1,2తరగతుల్లోనే ఇంగ్లీషును బోధనాభాషగా అమలు చేయడం వల్ల అటు తల్లిభాషకు, ఇటుపరాయి భాషకు దూరమయ్యే పరిస్థితి నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Courtesy:ఆంధ్రజ్యోతి


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


ఢిళ్ళీ లో ఆంధ్ర భవన్‌ పునర్నిర్మాణం

ఏపీ భవన్‌ ఇక మాయం
ప్రస్తుత స్థలంలో వాణిజ్య సముదాయం
ఏటా రూ. 77 కోట్ల ఆదాయంపై దృష్టి

న్యూఢిల్లీ, జూన్‌ 27 (న్యూస్‌టుడే): మూడేళ్ల తర్వాత మీరు ఢిల్లీ వస్తే ప్రస్తుతం అక్కడున్న ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ కనిపించదు. అదే స్థలంలో ఏడంతస్తుల భారీ వాణిజ్య సముదాయం లేవనుంది. బహుళజాతి సంస్థలకు అద్దెకిచ్చే ఈ సముదాయం.. రాష్ట్రానికి ఏటా రూ. 77 కోట్ల ఆదాయం అందిస్తుంది. మరి ఆంధ్రాభవన్‌ ఎక్కడికి వెళుతుంది? ఓ 250 మీటర్ల దూరంలో ఉన్న పటౌడీ హౌస్‌ ప్రాంతానికి తరలుతుంది. 7.56 ఎకరాల విశాల స్థలంలో ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ను పునర్నిర్మిస్తారు. ప్రస్తుతం ఆంధ్రభవన్‌లో ఉన్న గోదావరి, శబరి, స్వర్ణముఖి బ్లాక్‌లు; సేవకుల క్వార్టర్లు; నర్సింగ్‌ హాస్టల్‌ ప్రాంతం మొత్తం కూల్చేసి, 12.66 ఎకరాల్లో 'ఇండియా హాబిటెట్‌ సెంటర్‌' తరహాలో వాణిజ్య సముదాయం నిర్మిస్తారు. ఆంధ్రాభవన్‌, వాణిజ్య సముదాయం.. రెండింటి నిర్మాణానికి రూ. 210 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని నూతన భవనంలో చేరే బహుళ జాతి సంస్థల నుంచి అద్దె అడ్వాన్సుల కింద సేకరిస్తారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. ఆదివారం ఢిల్లీకి బయలుదేరే ముందు హైదరాబాద్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ తరలింపునకు సంబంధించి విధాన నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్లలో మొత్తం పెట్టుబడి తిరిగి వస్తున్నందున ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్‌ సోమవారం ఢిల్లీలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా ఈ ప్రాజెక్టును చేపడుతుంది. గతంలో ఆంధ్రభవన్‌ నిర్మాణానికి ప్లాన్‌ ఇచ్చిన సంస్థకే నూతన ప్రాజెక్టును అప్పజెప్పారు. ఐతే ఇతర ప్రతిష్ఠాత్మక ప్లానింగ్‌ సంస్థల సహకారం కూడా తీసుకుంటారు. చారిత్రక 'ఇండియా గేట్‌'కు కూతవేటు దూరంలో ఉండే అద్భుత నిర్మాణం హైదరాబాద్‌ హౌస్‌. అది నిజాం సంస్థానం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు లభించిన వారసత్వ ఆస్తి. ఆ భవనానికి వెనుక భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ను నిర్మించింది. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా హైదరాబాద్‌ హౌస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అందుకు ప్రతిగా పటౌడీ హౌస్‌ ప్రాంతంలోని స్థలాన్ని, ఆంధ్రభవన్‌ పక్కనే ఉన్న నర్సింగ్‌ హాస్టల్‌ స్థలాన్ని రాష్ట్రానికి ఇచ్చింది.

Courtesy: ఈనాడు

********************

Delhi to have new AP Bhavan

M. Malleswara Rao

HYDERABAD: The Andhra Pradesh Government will construct a brand new AP Bhavan in Delhi replacing the existing one, with a commercial angle to get an annual income of about Rs. 80 crores to the ex-chequer.

AP Bhavan has nearly 20.2 acres under its control including 7.6 acres occupied by Pataudi House, which was given by the Central Government in lieu of Hyderabad House.

The bhavan has a suite for the Governor and three blocks -- Godavari, Swarnamukhi and Sabari. It consists of a cafeteria whose Andhra flavours are relished by Delhiites, and the office of the State's Resident Commissioner who has been asked to do liaison work for getting clearances for pending irrigation projects.

Blueprints ready

Official sources told The Hindu here on Wednesday that blueprints have been prepared to construct the new AP Bhavan complex at a cost of Rs. 210 crores, with a commercial extension to put the precious land in the heart of New Delhi to economic use. The Chief Minister, Y.S. Rajasekhara Reddy, has reportedly given the green signal to the Resident Commissioner to go ahead with the plan.

Under the plan, a seven-storey institutional building will come up in place of the existing complex for commercial purposes on rent restricting the benefit to Government offices or undertakings. The complex with the Chief Minister's camp office, Governor's suite, office of the Resident Commissioner and cafeteria will be shifted to land in Pataudi House.

Helipad being enclosed

The Andhra Pradesh Infrastructure Development Corporation will be made the nodal agency for implementing the project while an empowered committee headed by the Chief Secretary will monitor it.

Meanwhile, back at the Secretariat here, the area around the helipad is being landscaped and enclosed with grills.

A police outpost is to be posted in view of the security risks following escalated violence by naxalites. Plans have also been finalised to add two more storeys on the `H' block with 80,000 sqft at a cost of Rs 1.10 crores.

Courtesy: The Hindu

********************

Habitat-like centre at AP Bhavan soon

New Delhi, July 3: An Indian Habitat Centre (IHC) like complex is proposed to be built at the present premises of the Andhra Pradesh Bhavan in New Delhi, which will have a state-of-the-art convention centre, an art gallery and offices accommodation. The Chief Minister, Dr Y. S. Rajasekhar Reddy is soon expected to finalise a blueprint that will not only maximise the use of available land in the heart of Lutyen�s Delhi, but will increase earnings from the land. In the process, the State government proposes to make over Rs 70 crore annually through rental income.

The proposed complex in an area of over 10 acres would be rented out to various institutions, multi-national companies. Seven-storeyed buildings are proposed to be constructed in the complex. The entire project is estimated to cost over Rs 210 crore and yield a net annual revenue of Rs 77 crore. It is likely to be completed by 2008. Dr Rajasekhar Reddy has plans to get the best possible design through what is known as the Swiss challenge. An architect is asked to prepare a design, which is posed to other architects. Finally, the best possible design is adopted.

Dr Rajasekhar Reddy recently held a high-level meeting with State government officials in Hyderabad and approved a plan of action for the project. As a result of the new plans, the present complex, which has a Governor�s Suite and Chief Minister�s Suite, besides a complex for accommodation of the State MPs, MLAs and senior officials would be shifted to nearby Pataudi House area, close by. According to the State government sources, the Andhra Pradesh Infrastructure Corporation would be the nodal agency to execute the project.

They said the State government wanted to develop the proposed complex incorporating the best innovative architectural ideas. The land in Pataudi House area was given to Andhra Pradesh government by the Central government in lieu of the magnificent Hyderabad House. The Hyderabad House is now being used to host Heads of States and other dignitaries. All the facilities of the Andhra Pradesh Bhavan, including the office of resident commissioner, guest house accommodation and staff quarters, are proposed to be shifted to the Pataudi House plot.

Courtesy: Deccan Chronicle


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Sunday, June 26, 2005

Lengua Telugu

Spanish language pages about Dravidian languages, Telugu language and it's writing system.


Lenguas drávidas





La familia de lenguas drávida incluye aproximadamente 26 lenguas, habladas principalmente en el sur de la India y Ceilán, asi como algunas áreas de Paquistán, Nepal y el oeste y centro de la India.

Las lenguas drávidas son habladas por mas de 200 millones de personas y parecen no estar realcionadas con otras familas conocidas. Algunos estudiosos incluyen las lenguas drávidas en una familia mayor llamada elamo-drávida, que incluye el antiguo elamita hablado en lo que actualmente es el sudoeste de Irán. La teoría no es aceptada por la mayoría de los experton en estas lenguas.


Idioma telugú

El telugú de es una lengua que pertenece a la familia drávida y es la lengua oficial del estado indioAndhra Pradesh, la región oriental de la península. Se trata de una de las veintidós lenguas oficiales de la India. Donde es la segunda lengua materna más hablada después del Hindi. En el siglo XIX los ingleses la denominaban la lengua italiana del este debido a que todas las palabras en telugu terminan con un sonido vocálico y suelen ser bastante melódicas.





El telugu se habla principalmente en Andhra Pradesh en India y en estados indios vecinos como Karnataka, Tamil Nadu, Maharastra y Orissa. Además se habla en Bahrain, Fiji, Malasia, Mauricio, Estados Unidos, Singapur, Reino Unido y los Emiratos Árabes Unidos. En los Estados Unidos hay una próspera comunidad de hablantes de telugú.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Saturday, June 25, 2005

ఆచార్య నాగార్జున




A blog post in English and Japanese about Acharya Nagarjuna, the famous Buddhist scholar from Andhra desa. He is considered as the founder of Mahayana Buddhism and wrote the treatise 'prAtitya mUlamAdhyamika kArika' (ప్రాతిత్య మూలమాధ్యమిక కారిక).

http://darumapilgrim.blogspot.com/2005/06/nagarjuna.html


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Thursday, June 23, 2005

Eenadu in Firefox: Slashdot discussion (old)

Just found an old (June 2004) but interesting discussion on Slashdot about the problem associated with viewing Eenadu font in Mozilla Firefox.


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


AP to woo Telugu NRIs

HYDERABAD, JUNE 23: The Andhra Pradesh government has proposed to target Telugu speaking non-resident Indians to attract industrial investment into the state. The government has proposed to organise meetings in the US during the Telugu Association of North America (TANA) annual meeting being held in Detroit from July 1 to 3, 2005. Also, the delegation will meet prospective investors including the heads of Intel, Newlight Design Center, Solectron and Cypress, who have evinced interest in setting up manufacturing facilities in AP, an official release said.

The delegation headed by AP Speaker K R Suresh Reddy is visiting the US during the TANA meetings. “We want to utilise the opportunity and plan to show-case the business opportunities and government incentives to the NRIs there,” sources said.

Courtesy: The Financial Express


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


MoU inked for Telugu Museum atop Kailasagiri

Thursday June 23 2005 13:16 IST

VISAKHAPATNAM: Decks have been cleared on Wednesday for setting up of Telugu Museum (‘Telugu Samskrutika Niketanam’) atop the Kailasagiri with the signing of a memorandum of understanding by VUDA Vice-Chairman G Venkatram Reddy and World Telugu Federation (WTF) chairperson Indira Dutt.

The museum is estimated to cost Rs 5 crore and will throw light on the culture and heritage of the State from Satavahana era to the modern times. The history of Telugu people will be depicted through pictures and other forms and a light and sound show will be organised to enlighten the people.

The WTF will contribute Rs 3.8 crore and VUDA Rs 1.2 crore. On the occasion, Venkatram Reddy said the light and sound show will be conducted in English also for the benefit of foreigners and non-Telugu people visiting the hill resort. An amphitheatre will be promoted to conduct cultural shows regularly.

VUDA Chairman PSN Raju, WTF secretary general BSR Krishna, regional chairman Y Lakshmi Prasad, vice-chairman V Tapovardhan, secretary D Muralidhar Reddy, VUDA OSD Y Ramesh and others were present.


Courtesy: NewIndPress


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'


Wednesday, June 22, 2005

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య



Sri Tallapaka Annamacharya (1408-1503) the mystic saint composer of the 15th century is the earliest known musician of South India to compose songs called “sankIrtanas” in praise of Lord Venkateswara, the deity of Seven Hills in Tirumala, India. Annamcharya is believed to be the incarnation of Lord Venkateswara's. nandaka (Sword). A rhyming couplet of poems called dwipada written by Tallapaka Chinnanna, grandson of Annamacharya, enabled us to learn about Annamacharya's life and works.

During his long and prolific career, Annamacharya composed and sang 32,000 Sankirtanas, 12 Satakas (sets of hundred verses), Ramayana in the form of dwipada, sankIrtana lakshaNam (Characteristics of sankIrtanas), SRngAra manjari, and vEnkaTAchala mahAtmamyam. His works were in Telugu, Sanskrit and a few other languages of India. Annamacharya wrote the sankIrtanas on palm leaves and later his son Tirumalacharya got them engraved on copper plates. But for reasons not known, most of these copper plates lay hidden in the Tirumala temple unnoticed for over 400 years. In 1922, twenty five hundred copper plates, comprising of about 14,000 sankIrtanas and a few other works, were found in a rock built cell, later named as Sankirtana Bhandagaram, opposite to the hunDI (donation box) . Ever since the discovery of this lost treasure, Tirumala Tirupati Devastanams (TTD) and other organizations in India are working hard to promote the music and literature of Annamacharya.



అన్నమయ్య సంకీర్తనాలు


[Source: అన్నమయ్య పద సౌరభం - రెండవ భాగం
స్వరకర్త నేదునూరి కృష్ణమూర్తి
ప్రచురణ - నాదసుధాతరంగిణి]


1. అలమేలుమంగనీ వభినవరూపము (వాల్యూం 12-159)

అలమేలుమంగనీ వభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ

గరుడాచలాధీశు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసి తిగదమ్మ

శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మ

రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు
జట్టిగొని వురమునసతమైతివమ్మ

=====================

2. వలదననొరులకు (వాల్యూం 4-17)

వలదననొరులకు వశమటవే
తలచినట్లనిది దైవమెచేసె

తరుణికుచములను తామరమొగుడలు
విరిసేనోయని వెరపునను
సరగునపతినఖ చంద్రశకలములు
దరులుగలుగనిది దైవమెచేసె

పొలతివదనమను పున్నమచంద్రుడు
బలిమినెగయునని భయమునను
మెలుతచికురధ మ్మిల్లపురాహువు
తలచెదరగనిది దైవమెచేసె

వనితకువాడునొ వలపుతాపమున
తనులతికయనుచు తమకమున
ఘనవేంకటపతి కౌగిటచమటల
తనివి దీర్చనిది దైవమె చేసె

=====================

3. పురుషోత్తముడవీవు (వాల్యూం 2-53)

పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోననాయందు మంచితనమేది

అనంతాపరాధములు అటునేముసేసివి
అనంతమైనదయ అది నీది
నినునెఱగకుండేటి నీచ గుణము నాది
ననునెడయకుండేటి గుణము నీది

సకలయాచకమే సరుసనాకుపని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను
వెకలివైనను గాచేవిధమునీది

నేరమింతయు నాది నేరుపింతయు నీది
సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు
యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపమునీది

=====================

4. భక్తికొలది వాడే (వాల్యూం 1-410)

భక్తికొలది వాడే పరమాత్ముడు
భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు

పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు
బట్టబయటి ధనము పరమాత్ముడు
పట్టపగటి వెలుగు పరమాత్ముడు
యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు

పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు
బచ్చనవాసినరూపు పరమాత్ముడు
బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు
యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు

పలుకులలోనితేట పరమాత్ముడు
ఫలియించునిందరికి పరమాత్ముడు
బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు
యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు

=====================

5. ఏమొకో చిగురుటధరమున (వాల్యూం 12-82)

ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

=====================

6. తెలిసిన వారికి దేవుండితడే (వాల్యూం 3-480)

తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల

పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు

పలుబ్రహ్మలకును పరబ్రహ్మము
మలయునీశులకు మహేశుడితడు
ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు
ఖలులకెట్లుండునో కానము యితడు

వేదంబులలో వేదాంతవేద్యుడు
సోదించకరిగాచుచో నాదిమూలము
యీదెస శ్రీ వేంకటేశుడిందరికి
గాదిలి మతులను గైకొనడితడు

=====================

7. కొలిచిన వారల (వాల్యూం 3-419)

కొలిచిన వారల కొంగుపైడితడు
బలిమి తారక బ్రహ్మమీతడు

యినవంశాంబుధి నెగసిన తేజము
ఘన యజ్ఞంబుల గల ఫలము
మనుజరూపమున మనియెడి బ్రహ్మము
నినుపుల రఘుకుల నిథానమితడు

పరమాన్నములోపలి సారపుజవి
పరగినదివిజుల భయహరము
మరిగినసీతా మంగళ సూత్రము
ధరలో రామావతారంబితడు

చకితదానవుల సంహారచక్రము
సకలవన చరుల జయకరము
వికసితమగు శ్రీవేంకట నిలయము
ప్రకటిత దశరథ భాగ్యంబితడు

=====================

8. అంతరంగమెల్ల (వాల్యూం 1-437)

అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె
వింతవింత విధముల వీడునా బంధములు

మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా
ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము

చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా
పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా
యెదుట తాను రాజైతే ఏలేనాపరము

పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా
జీవించి ఫలమేది చింత దీరుదాకా
వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక
భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా

=====================

9. భక్తినీపై దొకటె పరమసుఖము (వాల్యూం 3-322)

భక్తినీపై దొకటె పరమసుఖము
యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు

కులమెంత గలిగెనది కూడించు గర్వంబు
చలమెంత గలిగెనది జగడమే రేచు
తలపెంత పెంచినా తగిలించు కోరికలు
యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు

ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు
మొనయు చక్కదనంబు మోహములు రేచు
ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము
యెనయగ పరమ పద మించుకయులేదు

తరుణులెందరు అయిన తాపములు సమకూడు
సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు
యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా
పెరిగె నానందంబు బెళకులికలేవు

=====================

10. విశ్వరూపమిదివో (వాల్యూం 3-409)

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము

=====================

11. అవధారు రఘుపతి (వాల్యూం 3-492)

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు
యివలనిండే కొలువిదెనదె సముఖాన

రామరాఘవరామ రామచంద్రప్రభో
శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు
మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో

యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక
ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె
వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర

కందువకౌసల్యాగర్భ రత్నాకర
చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక
చెంది నీరాజసము చెప్పరాదు రామ

=====================

12. రామచంద్రుడితడు (వాల్యూం 10-147)

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయ గలిగెనిందరికి

గౌతము భార్యపాలిటి కామధేనువితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
యీతడు దాసుల పాలిటి యిహపర దైవము

పరగసుగ్రీవుపాలి పరమ బంధువితడు
సరిహనుమంతుపాలి సామ్రాజ్యము
నిరతి విభీషణునిపాలి నిధానము యీతడు
గరిమజనకు పాలి ఘనపారిజాతము

తలప శబరిపాలి తత్వపు రహస్యము
అలరిగుహునిపాలి ఆదిమూలము
కలడన్నవారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీవేంకటాద్రి విభుడితడు

=====================

13. పలువిచారము లేల (వాల్యూం 3-100)

పలువిచారములేల పరమాత్మనీవు నాకు
కలవు కలవు ఉన్న కడమలేమిటికి

నీపాదముల చెంత నిబిడమైతే చాలు
యేపాతకములైన ఏమిసేసును
యేపార నీభక్తి ఇంత గలిగిన చాలు
పై పై సిరులచ్చట పాదుకొని నిలుచు

సొరిదినీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు

నేరకవేసిన చాలు నీమీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీవేంకటేశ నిన్నుగొలిచితి నేను
యేరీతినుండిన గాని యిన్నిటా ఘనుడను

=====================

14. ఇతరములిన్నియు (వాల్యూం 1-86)

ఇతరములిన్నియు నేమిటికి
మతిచంచలమే మానుటపరము

ఎక్కడి సురపుర మెక్కడి వైభవ
మెక్కడి విన్నియునేమిటికి
యిక్కడనే పరహితమును పుణ్యము
గక్కున జేయగ గలదిహ పరము

యెవ్వరు చుట్టములెవ్వరు బంధువు
లెవ్వరిందరును నేమిటికి
రవ్వగు లక్ష్మీరమణుని దలపుచు
యివ్వలదా సుఖియించుట పరము

యెందరు దైవము లెందరు వేల్పులు
యెందరిందరును నేమిటికి
కందువెఱిగి వేంకటగిరి రమణుని
చిందులేక కొలిచినదిహ పరము

=====================

15. నారాయణాచ్యుతానంత (వాల్యూం 2-423)

నారాయణాచ్యుతానంత గోవింద హరి
సారముగ నీకునే శరణంటిని

చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు

పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు

యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే

=====================

16. ఏటి సుఖము (వాల్యూం 1-135)

ఏటి సుఖము మరి ఏటి సుఖము
ఒకమాట మాత్రము నటమటమైన సుఖము

కొనసాగు దురితములె కూడైన సుఖము
తను విచారములలో దాకొన్న సుఖము
పనిలేని యాసలకు బట్టయిన సుఖము
వెనక ముందర జూడ వెరగైన సుఖము

నిందలకులోనైన నీరసపు సుఖము
బొందికిని లంచంబు పుణికేటి సుఖము
కిందుపడి పరులముంగిలి గాచు సుఖము
పందివలె తనుదానె బ్రతికేటి సుఖము

ధృతిమాలి యిందరికి దీనుడగు సుఖము
మతిమాలి భంగములు మరపించు సుఖము
పతి వేంకటేశు కృప పడసినది సుఖము
యితరంబులన్నియును నీ పాటి సుఖము

=====================

17. నవనీతచోర (వాల్యూం 3-24)

నవనీతచోర నమోనమో నవమహిమార్ణవ నమోనమో

హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ
నరసింహ వామన నమోనమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణ నమోనమో

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమోనమో
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమోనమో

వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర
నాకేశవందిత నమోనమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజనుత నమోనమో

=====================

18. ఆలాగు పొందులును (వాల్యూం 1-30)

ఆలాగు పొందులును అటువంటి కూటములు
యీలాగు లౌటనేడిదె చూడనైతి

అడియాస చూపులకు నాసగించితిగాని
వెడమాయలనిలోను వెదకలేనైతి
కడువేడుకల దగిలి గాసిబొందితిగాని
యెడలేని పరితాప మెఱగలేనైతి

చిరునగవుమాటలకు చిత్తగించితిగాని
తరితీపులని లోను తలుపలేనైతి
వరుసమోహపు బసలవలల చిక్కితిగాని
గరువంపు పొలయలుక గానలేనైతి

శ్రీ వేంకటేశ్వరుని చింతజేసితిగాని
దేవోత్తమునిలాగు తెలియలేనైతి
యీ వైభవముపై నిచ్చగించితి గాని
యీ వైభవానంద మిది పొందనైతి

=====================

19. రాముడు లోకాభిరాముడు (వాల్యూం 2-219)

రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే

వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే

ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే

బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని
ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే

=====================

20. కొలనిలోన (వాల్యూం 2-214)

కొలనిలోనమునుగోపికలు
మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు

పిరుదులు దాటిన పింఛపు టలకల
తురుములు వీడగ తొయ్యెలులు
అరిది నితంబులందునెదాచుక
మురిపెపు కరముల మ్రొక్కిరినీకు

నిద్దపు మానము నెలతలు లోగుచు
గద్దరి తొడలనె గట్టుచును
ముద్దుటుంగరంబుల కరములతో
ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు

పాలిండ్ల పెనుభారంబుల
మూలపు మెరుగులు ముంచగను
వేలపు ప్రియముల వేంకటేశనిను
మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు

=====================

21. అమరాంగనలదె (వాల్యూం 10-26)

అమరాంగనలదె ఆడేరు
ప్రమదంబుననదె పాడేరు

గరుడవాహనుడు కనక రథముపై
ఇరవుగ వీధుల నేగేని
సురలును మునులును సొంపుగ మోకులు
తెరలిచి తెరలిచి తీసేరు

ఇలధరుడదివో ఇంధ్రరథముపై
కెలయుచు దిక్కులు గెలిచీని
బలు శేషాదులు బ్రహ్మశివాదులు
చెలగి సేవలటు సేసేరు

అలమేల్మంగతో నటు శ్రీవేంకట
నిలయుడరదమున నెగడేని
నలుగడ ముక్తులు నారదాదులును
పొలుపు మీరకడు పొగడేరు

=====================

22. పసిడియక్షంతలివె (వాల్యూం 3-194)

పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని

శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి
దైవికపు పెండ్లిముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని

కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి
పందిలిలోపల తలంబాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరి పెండ్లికిని

అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును
మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు
యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె
కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని

=====================

23. పాపపుణ్యముల రూపము (వాల్యూం 1-28)

పాపపుణ్యముల రూపము దేహమిది దీని
దీపనంబణగింప తెరువెందులేదు

అతిశయంబైన దేహాభిమానము దీర
గతిగాని పుణ్యసంగతి బొందరాదు
మతిలోని దేహాభిమానంబు బిడుచుటకు
రతిపరా~జ్ముఖుడు గాక రవణంబు లేదు

సరిలేని మమకారజలధి దాటినగాని
అరుదైన నిజసౌఖ్యమది వొందరాదు
తిరువేంకటాచలాధిపుని గొలిచినగాని
పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు

=====================

24. సకలశాంతికరము (వాల్యూం 3-377)

సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
ప్రకటమై మాకు నబ్బె బతికించు నిదియె సర్వేశ

మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన
నినుదలచినంతనే నీఱౌను
కనుగొన్న పాపములు కడలేనివైనాను
ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును

చేతనంటి పాతకాలు సేనగానే జేసినాను
ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు
ఘాతలజెవుల వినగా నంటిన పాపము
నీతితో నీ కథ వింటే నిమిషానబాయును

కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల
కాయపునీ ముద్రలచే గ్రక్కున వీడు
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా
అయమైన నీ శరణాగతిచే నణగు

=====================

25. చాలుచాలును (వాల్యూం 12-45)

చాలుచాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ

ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌగిలే వదలె
పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప
పొందుగాదట యేటి పొందురా ఓరీ

నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచిన అంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేటి వలపురా ఓరీ

కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ
నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ

=====================

26. తరుణినీయలుక (వాల్యూం 12-70)

తరుణినీయలుకకెంతటిది ఇంతినీ వేళ
కరుణించగదర వేంకటశైలనాథ

ఒకమారు సంసారమొల్ల బొమ్మని తలచు
ఒక మారు విధిసేతలూహించి పొగడు
ఒక మారు తనుజూచి వూరకే తలవూచు
నొకమారు హర్షమున నొందిమేమఱచు

నినుజూచివొకమారు నిలువెల్ల పులకించు
తనుజూచి వొకమారు తలపోసి నగును
కనుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి
యిన్నియును తలపొసి యింతలో మఱచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుడవునిను బాయ జాలదొకమారు

=====================

27. ఆకటి వేళల అలపైన వేళలను (వాల్యూం 1-158)

ఆకటి వేళల అలపైన వేళలను
తేకువ హరినామమే దిక్కుమరి లేదు

కొఱమాలియున్నవేళ కులముచెడినవేళ
చెరవడి వొరులచే జిక్కిన వేళల
వొరపైన హరినామ మొక్కటే గతిగాక
మరచి తప్పిననైన మఱిలేదు తెఱగు

ఆపదవచ్చినవేళ యారడిబడినవేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతిగాక
మాపుదాకా బొరలిన మరిలేదు తెఱగు

సంకెళ బెట్టిన వేళ చంపబలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వెంకటేశు నామమే విడిపించగతిగాక
మంకుబుద్ధి పొరలిన మరిలేదు తెఱగు

=====================

28. అదె చూడరే (వాల్యూం details not given in the book! )

అదె చూడరే మోహన రూపం
పది కోట్లుగల భావజ రూపం

వెలయగ పదారువేల మగువలను
అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజము గొల్లెతల
కులుకు చూపులకు గురియగు రూపం

ఇందిరా వనిత నెప్పుడు తన ఉర
మందు నిలిపిన మోహన రూపం
కందువ భూసతి కౌగిటి సొంపుల
విందులు మరగిన వేడుక రూపం

త్రిపురసతుల బోధించి రమించిన
అపురూపపు మోహన రూపం
కపురుల శ్రీ వేంకటపతి యైయిల
ఉపమించగ రాని ఉన్నత రూపం

=====================

29. ప్రతిలేని పూజదలపంగ (వాల్యూం 12-300)

ప్రతిలేని పూజదల పంగకోటి మణుగులై
అతివ పరవశము బ్రహ్మానందమాయె

మానినీమణిమనసు మంచియాసనమాయె
ఆనందబాష్పజల మర్ఘ్యాదులాయె
మీనాక్షి కనుదోయి మించుదీపములాయె
ఆనన సుధారసంబభిషేకమాయె

మగువచిరునవ్వులే మంచి క్రొవ్విరులాయె
తగుమేనితావి చందనమలదుటాయె
నిగనిగనీతనుకాంతి నీరాజనంబాయె
జగడంపుటలుకలుపచారంబులాయె

ననుపైన పొందులె నైవేద్య తతులాయె
తనివోని వేడుకలు తాంబూలమాయె
వనిత శ్రీ వేంకటేశ్వరుని కౌగిట జేయు
వినయ వివరంబు లరవిరిమ్రొక్కులాయె

=====================

30. మరలిమరలి జయమంగళము (వాల్యూం 1-448)

మరలి మరలి జయమంగళము
సొరిదినిచ్చలును శుభమంగళము

కమలారమణికి కమలాక్షునకును
మమతల జయజయ మంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహూర్తముతో శుభమంగళము

జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభమంగళము
కలిమికాంత కాకలికి విభునికిని
సుళువుల యారతి శుభమంగళము

చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి
మత్తిల్లిన జయ మంగళము
యిత్తల నత్తల యిరువురకౌగిటి
జొత్తుల రతులకు శుభమంగళము

==================================================
Source: అన్నమాచార్యుల సంకీర్తనలు TTD Publ. Series No.128
==================================================

31. విన్నపాలు వినవలె వింత వింతలు (రాగం - భూపాళం)

విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా

గరుడ కిన్నరయక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా

=====================

32. అలరులు గురియగ నాడెనదే (రాగం - శంకరాభరణం)

అలరులు గురియగ నాడెనదే
అలకల గులుకుల నలమేలుమంగ

అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ

మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ

చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ

=====================

33. కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు

=====================

34. చక్కని తల్లికి చాంగుభళా తన (రాగం - పాడి)

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా

=====================

35. పలుకు దేనెల తల్లి పవళించెను (రాగం - సాళంగనాట)

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన

=====================

36. వలదన నొరులకు వసమటవే (రాగం - సామంతం)

వలదన నొరులకు వసమటవే
తలచినట్లు నిది దైవమె చేసె

తరుణి కుచములను తామర మొగుడలు
విరిసేనో యని వెరపునను
సరగున బతి నఖ చంద్రశకలములు
దరుల గలుగ నివి దైవమె చేసె

పొలతి వదనమను పున్నమ చంద్రుడు
బలిమి నెగయునని భయమునను
మెలుత చికుర ధమ్మిల్లపు రాహువు
తల జెదరగ నిది దైవమె సేసె

వనితకు వాడునొ వలపు తాపమున
తనులతిక యనుచు దమకమున
ఘన వేంకటపతి కౌగిట చెమటల
దనివి దీర్చనిది దవమె సేసె

=====================

37. ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి (రాగం - ముఖారి)

ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
యిదిగాక వైభవం బిక నొకటి కలదా

అతివ జన్మము సఫలమై పరమయోగివలె
నితర మోహాపేక్ష లిన్నియును విడిచె
సతి కోరికలు మహాశాంతమై యిదె చూడ
సతత విజ్ఞాన వాసన వోలె నుండె

తరుణి హృదయము కృతార్థత బొంది విభుమీది
పరవశానంద సంపదకు నిరవాయ
సరసిజానన మనో జయ మంది యింతలో
సరిలేక మనసు నిశ్చలభావమాయ

శ్రీ వేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ
భావంబు నిజముగా బట్టె జెలియాత్మ
దేవోత్తముని కృపాధీనురాలై యిపుడు
లావణ్యవతికి నుల్లంబు దిరమాయ

=====================

38. పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను (రాగం - సామంతం)

పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాదాయను
నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు

కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు
నున్నవి యొయ్యారంబులు నొచ్చిన చూపులును
విన్నదనంబుల మఱపులు వేడుక మీరిన యలపులు
సన్నపు జెమటలు దలచిన ఝల్లనె నా మనసు

ఆగిన రెప్పల నీరును నగ్గలమగు పన్నీటను
దోగియు దోగని భావము దోచిన పయ్యెదయు
కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు
వేగిన చెలి తాపమునకు వెన్నెల మండెడిని

దేవశిఖామణి తిరుమల దేవుని దలచిన బాయక
భావించిన యీ కామిని భావము లోపలను
ఆ విభుడే తానుండిక నాతడె తానెఱగగవలె
నీ వెలదికి గల విరహంబేమని చెప్పుదము

=====================

39. జవ్వాది మెత్తినది అది తన (రాగం - శంకరాభరణం)

జవ్వాది మెత్తినది అది తన
జవ్వనమే జన్నె వట్టినది

ముద్దుల మాటలది అది చెక్కు
టద్దముల కాంతి నలరినది
గద్దరి చూపులది అది తన
వొద్ది చెలియమీద నొరగున్నది

పుత్తడి బోలినది అది తన
చిత్తము ని సొమ్ము చేసినది
గుత్తపు గుబ్బలది అది అల
చిత్తజుని లెక్క సేయనిది

ఎమ్మెలు యెఱుగనిది అది తన
కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది
కమ్ముకొనగ వెంకటరాయా నీ
కమ్మని కౌగిట గలశున్నది

=====================

40. విరహపు రాజదె విడిదికి రాగా (రాగం - సామంతం)

విరహపు రాజదె విడిదికి రాగా
సిరుల జేసె నిదె సింగారములూ

నెలత నుదుటిపై నీలపు గురులనె
తొలుతనె కట్టెను దోరణము
మొలక చెమటలనె ముత్యపు మ్రుగ్గులు
అలరిచె మదనుండదె చెలిమేన

దట్టముగా జింతా లతనే వడి
బెట్టి జప్పరము పెనగొనగ
పట్టిన మైతావులు పరిమళములు
కట్టించెను చెంగట వలరాజు

విందగు వేంకట విభుని ప్రేమచే
బొందగ బెట్టెను బోనాలు
ఇందువదనకీ యిందిరావిభుని
కందుదేర నలు కలు చలి చేసె

=====================

41. కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు (రాగం - ఆహిరి)

కొమ్మ తన ముత్యాల కొంగు జారగ బగటు
కుమ్మరింపుచు దెచ్చు కొన్నదీ వలపు

ఒయ్యారమున విభుని వొరపు గనుగొని రెప్ప
మయ్యు నేరక మహా మురిపెమునను
కయ్యంపు గూటమికి గాలు దువ్వుచు నెంతె
కొయ్యతనమున దెచ్చు కొన్నదీ వలపు

పైపైనె ఆరగింపకుము పన్నీరు గడు
తాపమవునని చెలులు దలకగానే
తోపు సేయుచు గెంపు దొలకు గన్నుల కొనల
కోపగింపుచు దెచ్చు కొన్న దీవలపు

ఎప్పుడును బతితోడ నింతేసి మేలములు
ఒప్పదని చెలిగోర నొత్తగానే
యెప్పుడో తిరువేంకటేశు కౌగిట గూడి
కొప్పుగులుకుచు దెచ్చు కొన్నదీవలపు

=====================

42. చేరి యశోదకు శిశువితడు (రాగం - శుద్ధవసంతం)

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు

సొలసి చూచినను సూర్య చంద్రులను
లలి వెద చల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నఖిల దేవతల
కలిగించు సురల గనివో యితడు

మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమెటి గుణరాశి
నీటగు నూర్పుల నిఖిల వేదములు
చాటువ నూరెటి సముద్ర మితడు

ముంగిట మొలసిన మోహన మాత్మల
బొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాధిపు డితడు

=====================

43. మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె (రాగం - కాంభోజి)

మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె
ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు

చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా
మొక్క బోయీ గాళ్ళకు ముద్దులాడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లమాపుదాక
ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు

రువ్వెడి రాళ్ళదల్లి రోల దన్ను గట్టెనంట
మువ్వల గంటల తోడి ముద్దులాడు
నవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె
మువ్వురిలో నెక్కుడైన ముద్దులాడు

వేల సంఖ్యల సతుల వెంట బెట్టుకొనిరాగా
మూల జన్నుగుడిచీని ముద్దులాడు
మేలిమి వెంకటగిరి మీదనున్నాడిదె వచ్చి
మూలభూతి దానైన ముద్దులాడు

=====================

44. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు (రాగం - సాళంగనాట)

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు

=====================

45. ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని (రాగం - దేవగాంధారి)

ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే

గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే

ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే

ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే

=====================

46. ఉగ్గు వెట్టరే వోయమ్మా చె (రాగం - భైరవి)

ఉగ్గు వెట్టరే వోయమ్మా చె
య్యొగ్గీనిదె శిశు వోయమ్మా

కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగున దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా

చప్పలు వట్టుక సన్నపు బాలుని
నుప్పర మెత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా

తొయ్యలు లిటు చేతుల నలగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్య మాటలను కొండల తిమ్మని
నొయ్యన తిట్టకు రోరమ్మా

=====================

47. పలుమరు వుట్ల పండుగను (రాగం - ముఖారి)

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను

ఊళ్ళవీధుల వుట్లు కృష్ణుడు
తాళ్ళు దెగిపడ దన్నుచును (న్నగను?)
పెళ్ళు కఠిల్లు పెఠిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము

బంగా(గ)రు బిందెల బాలు బెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెను రవములై

నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా
లగ్గలిక బగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ గురియగను

=====================

48. ఘమ్మని యెడి శృతి గూడగను (రాగం - పాడి)

ఘమ్మని యెడి శృతి గూడగను
కమ్మని నేతులు కాగగ జెలగె

నీలవర్ణుడని నీరజాక్షుడని
బాలుని నతివలు పాడేరో
పాలు పిదుకుచును బానల కాగుల
సోలిపెరుగు త్రచ్చుచు జెలరేగి

మందరధరుడని మాధవుడని గో
విందుని బాడేరు వెలదులిదే
నందవ్రజమున నలుగడనావుల
మందల బేయల మంచిరవముల

వెంకటపతియని వేదనిలయుడని
పంకజనాభుని బాడేరు
అంకుల చేతను నలరు రవంబుల
బింకపు మాటల బృందావనమున

=====================

49. ఉయ్యాలా బాలునూచెదరు కడు (రాగం - శంకరాభరణం)

ఉయ్యాలా బాలునూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు

బాలయవ్వనలు పసిడివుయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు

తమ్మిరేకు గనుదమ్ముల నవ్వుల
పమ్ము జూపుల బాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు

చల్లు జూపుల జవరాండ్లురే
పల్లె బాలుని బాడేరు
బల్లిదు వేంకటపతి జేరి యందెలు
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లనుచు

=====================

50. దీనుడనేను దేవుడవు నీవు (రాగం - శుద్ధవసంతం)

దీనుడనేను దేవుడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాక

మతి జనన మెరుగ మరణం బెరుగను
ఇతవుగ నినునిక నెరిగేనా
క్షితి బుట్టించిన శ్రీపతి నీవే
తతి నాపై దయ దలతువు గాక

తలచ బాపమని తలచ బుణ్యమని
తలపున ఇక నిను దలచేనా
అలరిన నాలో అంతర్యామివి
కలుష మెడయ నను గాతువు గాక

తడవ నా హేయము తడవ నా మలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీ వేంకట విభుడవు
కడదాక నిక గాతువు గాక

=====================

51. నానాటి బదుకు నాటకము (రాగం - ముఖారి)

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాటకము
యెట్ట నెదుట గల దీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడ మంత్రపు పని నాటకము
వొడి గట్టుకొనిన వుభయ కర్మములు
గడి దాటినపుడె కైవల్యము

తెగదు పాపము తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము

=====================

52. భావములోనా బాహ్యమునందును (రాగం - దేసాక్షి)

భావములోనా బాహ్యమునందును
గోవింద గోవిందయని కొలువవో మనసా

హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా

=====================

53. నారాయణతే నమో నమో (రాగం - పాడి)

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో

జలధిశయన రవి చంద్రవిలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకటనాయక
నాదప్రియ తే నమో నమో

=====================

54. జయ జయరామా సమరవిజయ రామా (రాగం - గుండక్రియ)

జయ జయరామా సమరవిజయ రామా
భయ హర నిజ భక్త పారీణరామా

జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞముగాచే కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండ రామా
ధర నహల్యపాలిటి దశరథ రామా
హరురాణి నుతుల లోకాభిరామా

అతి ప్రతాపముల మాయామృగాంతకరామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీ వెంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంశ రామా

=====================

55. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా (రాగం -
మాళవి)

శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయకా

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

అనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరీ
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

=====================

56. దేవ దేవం భజే దివ్యప్రభావం (రాగం - ధన్నాసి)

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం

=====================

57. ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు (రాగం - భూపాళం)

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి

=====================

58. చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు (రాగం - శ్రీరాగం)

చేరి కొల్వరో యీతడు శ్రీదేవుడు
యీ రీతి శ్రీ వెంకటాద్రి నిరవైన దేవుడు

అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు
చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు
కల వరద హస్తము గటి హస్తపు దేవుడు
మలసీ శ్రీ వత్స వనమాలికల దేవుడు

ఘన మకర కుండల కర్ణముల దేవుడు
కనక పీతాంబర శృంగార దేవుడు
ననిచి బ్రహ్మాదుల నాభి గన్న దేవుడు
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు

కోటి మన్మథాకార సంకులమైన దేవుడు
జూటపు గిరీటపు మించుల దేవుడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుడు
యీటులేని శ్రీవేంకటేశుడైన దేవుడు

=====================

59. పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము (రాగం - అట్టతాళం)

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా

=====================

60. ఇతరులకు నిను నెఱుగదరమా (రాగం - శ్రీరాగం)

ఇతరులకు నిను నెఱుగదరమా

సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విర
హితు లెఱుంగుదురు నిను నిందిరా రమణా

నారీకటాక్ష పటు నారాచ భయరహిత
శూరు లెఱుగుదురు నిను జూచేటి చూపు
ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు
ధీరు లెఱుగుదురు నీ దివ్య విగ్రహము

రాగభోగవిదూర రంజితాత్ములు మహా
భాగు లెఱుగుదురు నిను బ్రణుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహా
యోగు లెఱుగుదురు నీ వుండేటి వునికి

పరమ భాగవత పద పద్మసేవా నిజా
భరణు లెఱుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానస
స్థిరు లెఱుంగుదురు నిను తిరు వేంకటేశ

==================================================


Want your own TELUGU BLOG?
Get it today!
Click here for a step by step guide to blogging in 'Italian of East'